కరోనాతో కూరగాయల వ్యాపారి మృతి

by  |
కరోనాతో కూరగాయల వ్యాపారి మృతి
X

దిశ, కంటోన్మెంట్: కరోనా మహామ్మారికి ఓ కూరగాయల వ్యాపారి బలయ్యాడు. న్యూ‌బోయిన్‌పల్లి పరిధిలోని ధనలక్ష్మీ కాలనీకి చెందిన ఓ కూరగాయాల వ్యాపారి ఆరు రోజుల క్రితం దగ్గు, జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యానికి వెళ్లాడు. అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. దీంతో ఆ వ్యాపారి గాంధీలో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.



Next Story

Most Viewed