బ్రేకింగ్ : రాజ్‌భవన్ ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. (వీడియో)

by  |
బ్రేకింగ్ : రాజ్‌భవన్ ఎదుట పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : దిశ, ఖైరతాబాద్ : రాజ్ భవన్ ఎదుట గురువారం సూర్యాపేట జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రైతులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్న సమయంలో నాగరాజు రాజ్ భవన్ వద్దకు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

అప్పటికే అక్కడ భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నాయి. తాను కేసీఆర్ అభిమానినంటూ జై కెసీఆర్, జై తెలంగాణ, జై జగదీశ్వర్రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Next Story

Most Viewed