కేసీఆర్‌ను సంపూర్ణ దోషిగా నిలబెడుతాం.. కేంద్రమంత్రి శోభా కరండ్లజే సంచలన వ్యాఖ్యలు

by  |
కేసీఆర్‌ను సంపూర్ణ దోషిగా నిలబెడుతాం.. కేంద్రమంత్రి శోభా కరండ్లజే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆధారాలు ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెడుతామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే అన్నారు. సోమవారం సాయంత్రం మెదక్‌లో బండి సంజయ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలపై చర్చిద్దామని కలవడానికి సమయం కోరితే తనకే కేసీఆర్ సమయం ఇవ్వలేదని ఆరోపించారు. తనకే సమయం ఇవ్వకుంటే, మరి సామాన్యుల పరిస్థితేంటి అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి కేసీఆర్ టీఆర్ఎస్‌ను గెలిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ గ్రామంలో బండి సంజయ్ పాదయాత్రకు భారీ స్పందన వస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంగప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, లంకల దీపక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed