- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య దీక్ష

దిశ, కల్లూరు(సత్తుపల్లి): ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ సంభాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాలోతు హుస్సేన్ నాయక్, సత్తుపల్లి యువజన కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరుద్యోగ చైతన్య దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ కి సారా దుకాణాల మీద ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ నిరుద్యోగుల మీద లేదన్నారు, అదేవిధంగా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే తెలంగాణలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో తెలంగాణ ఉద్యమం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెంటనే రాజీనామా చేయాలని, సత్తుపల్లి నియోజకవర్గానికి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఆయన వల్ల సత్తుపల్లి నియోజకవర్గానికి ఒరిగింది ఏమి లేదని, రాజీనామా చేస్తే నియోజకవం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఇప్పటికైనా తెలంగాణ నిరుద్యోగ యువత మేల్కొని కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని నిరుద్యోగ యువతను కోరారు. సత్తుపల్లి నియోజకవర్గం యువజన నాయకులు అయిలూరి వెంకటచలపతి రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ చేస్తానని విద్యార్థులను నమ్మబలికి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు కానీ కేసీఆర్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. వీలైనంత తొందరలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సత్తుపల్లి మండలం యూత్ ప్రెసిడెంట్ తోట రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన నడుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. ఇంతవరకు ఆ ఊసే లేదని, మరియు ఉద్యోగ నోటిఫికేషన్ల జాడే లేదన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ హుస్సేన్ నాయక్, యువజన నాయకులు అయిలూరి వెంకటచలపతి రెడ్డి, సత్తుపల్లి మండలం యూత్ ప్రెసిడెంట్ తోట రాజేష్, కాలం కృష్ణ (వర్కింగ్ ప్రెసిడెంట్), షేక్ రహీంతుల్లా (మైనారిటీ సెల్), జొన్నలగడ్డ శ్రీను(ఎస్సీ సెల్),ఆర్.కోటేశ్వరరావు, కువ్వూరపు రాజా, వేల్పుల ప్రసాద్, యువజన నాయకులు బాల చెన్నారావు ,సంధిపాము మహేష్, పొద్దుటూరు రవి, కట్టా అశోక్ కుమార్,ధరావత్ వెంకట్,షేక్ కరీం,ఇస్లావత్ గోపి, దంపుల రమేష్, ఇజ్జగాని మధు తదితరులు పాల్గొన్నారు.