- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ జయంతి నుంచి సోనియాగాంధీ పుట్టినరోజు వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భారీ నిరసనకు దిగుతోంది. ఈ సారి నిరుద్యోగుల సమస్యే ప్రధాన ఎజెండాగా జంగ్ సైరన్ మోగిస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. అఖిలపక్షాలన్నీ ఈ నిరసనల్లో భాగస్వాములవుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 67 రోజుల పాటు ఈ నిరసన కొనసాగుతోంది. మొన్నటి వరకు క్విట్ ఇండియా దినం ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 వరకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు నిరుద్యోగ జంగ్ సైరన్కు దిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన చేపడుతున్నారు.
గతంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను ఏకంగా సీఎం కేసీఆర్ గడ్డ గజ్వేల్పైనే నిర్వహించి విజయవంతం చేశారు. ఇదే ఊపుతో ఉన్న హస్తం నేతలు ఇప్పుడు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర చేపట్టనున్నారు. దిల్సుఖ్నగర్లోని రాజీవ్ చౌక్లో ఇందిరా, రాజీవ్గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించి జంగ్ సైరన్ మొదలుపెట్టనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు భారీ పాదయాత్రను చేయనున్నారు. ఈ పాదయాత్రలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
నిరుద్యోగుల మద్దతు
కాంగ్రెస్ చేపట్టిన ఈ ఉద్యమానికి టీఆర్ఎస్, బీజేపీయేతర పార్టీలు దాదాపుగా అన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. నిరుద్యోగ జంగ్ సైరన్కు మద్దతు ప్రకటించాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా నిరుద్యోగ జేఏసీలు కూడా హాజరుకానున్నాయి.
- Tags
- congress