లక్కీ.. రూ.కోటితో రెండు దుకాణాలు

by  |
లక్కీ..  రూ.కోటితో రెండు దుకాణాలు
X

దిశ, నాగర్‌కర్నూల్: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు కోటి రూపాయలు ఖర్చు చేస్తే రెండు దుకాణాలకు అదృష్టం వరించింది. నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని 12వ వార్డు కౌన్సిలర్ శకుంతల బాయ్ రెండు దుకాణాలు సొంతం చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో 67 దుకాణాలకు అధికారులు టెండర్లు పిలవగా.. రిజర్వేషన్ల ద్వారా తన భర్త మోతి కుమార్, శకుంతల భాయ్ ఇరువురు 50 దుకాణాలకు టెండర్లు వేశారు. కాగా కౌన్సిలర్ శకుంతల భాయ్ నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన 2వ దుకాణం, 8వ దుకాణం కూడా దక్కింది. సుమారు ఒక దుకాణానికి రెండు లక్షల చొప్పున 50 దుణాలకు కోటికి పైగా ఖర్చు చేస్తే.. రెండు దుకాణాలు రావడంతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


Next Story

Most Viewed