- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ 6వ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రెండో షిఫ్ట్లో కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో నర్సయ్య, సలవెని శంకర్ అనే ఇద్దరు గని కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు శిథిలాల కింద ఇరుక్కుపోవడంతో వెలికితీసేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి.
ఘటనా స్థలికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. విషయం తెలియడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story