భూపాలపల్లి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
భూపాలపల్లి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ 6వ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. బుధ‌వారం రెండో షిఫ్ట్‌లో కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా పైక‌ప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో నర్సయ్య, సలవెని శంకర్ అనే ఇద్దరు గని కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృత‌దేహాలు శిథిలాల కింద ఇరుక్కుపోవడంతో వెలికితీసేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి.

ఘటనా స్థలికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను వెలికితీసేందుకు జ‌రుగుతున్న ఏర్పాట్లను ప‌ర్యవేక్షించారు. విషయం తెలియడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.



Next Story