- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని అగ్రహారానికి చెందిన అక్కా చెల్లెల్లు దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల ప్రకారం.. చీపురుపల్లిలోని సిద్దార్థ స్కూల్కి తన బంధువు మోటారు సైకిల్పై వెళ్తుండగా అటుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేసారు.
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను చందక యోషిత(5), చందక జ్ఞానేశ్వరి(10)గా స్థానికులు నిర్దారించారు. జ్ఞానేశ్వరి తల్లి శ్రీకాకుళం జిల్లా లావేరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా తండ్రి రమణ ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. యోషిత, జ్ఞానేశ్వరులు చిన్నాన్న, పెదనాన్న పిల్లలు కాగా వరుసకు అక్కా చెల్లెల్లు అవుతారని సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.