- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జగదేవపూర్ : సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జగదేవపూర్ మండలం గోల్లపల్లి బైపాస్ వద్ద శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన నీల రామనర్సు మునిగడప నుంచి జగదేవపూర్ వైపు వెళ్లుతుండగా గొల్లపల్లి గ్రామానికి చెందిన వి. బాల్ నర్సయ్య జగదేవపూర్ నుంచి సొంత గ్రామం గొల్లపల్లి వైపు వెళ్తుండగా రెండు బైకులు పరస్పరం ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
దీంతో మందాపూర్ గ్రామానికి చెందిన నీల రామనర్సుకు తీవ్ర గాయాలవ్వగా పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వెంటనే అతన్ని సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం రామనర్సు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.