Breaking: చెట్టును ఢీకొన్న టాటాఏస్.. 20 మందికి గాయాలు (వీడియో)

by  |
road accident
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృషాజివాడి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతేగాకుండా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా ఇద్దరిని నిజామాబాద్, మరో నలుగురికి హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ప్రమాదానికి టాటా ఏస్ వాహనం అతి వేగమే కారణమని స్థానికులు అంటున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో వివాహ వేడుకలు ముగించుకొని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి వెళుతుండగా సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



Next Story

Most Viewed