ధ్రువతార అస్తమయం చాలా బాధాకరం.. ‘సిరివెన్నెల’కు సజ్జనార్ శ్రద్ధాంజలి

by  |
ధ్రువతార అస్తమయం చాలా బాధాకరం.. ‘సిరివెన్నెల’కు సజ్జనార్ శ్రద్ధాంజలి
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీలోకం మూగబోయింది. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆర్టీసీ తరఫున శ్రద్ధాంజలి ఘటించారు. ‘మీ సాహిత్యంతో మమ్మల్ని మైమరపించి, మీ సాన్నిహిత్యంలో మధుర క్షణాలు మిగిల్చిన తెలుగు సినీ వినీలాకాశంలో వెలిగిన ధ్రువతార అస్తమయం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. #TSRTC యాజమాన్యం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.



Next Story