కేసీఆర్ దెబ్బకు గొర్ల కాపరిగా మారిన MPTC.. ఎక్కడో తెలుసా?

by  |
కేసీఆర్ దెబ్బకు గొర్ల కాపరిగా మారిన MPTC.. ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొంత మంది అధికారంలో ఉండి కూడా కూలి పని చేస్తూ ఉంటారు. ఇలానే సర్పంచ్ వాచ్ మెన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గొర్రెలు కాపరి కూలీగా పని చేయడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. వనపర్తి జిల్లా పాన్ గ‌ల్ మండలం శాఖాపూర్‌కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బయ్య యాదవ్ తమ గ్రామంలోని రాములు, కొమ్ము బిచ్చన్న వద్ద గొర్లకాపరి కూలీగా పనిచేస్తున్నాడు. తాను ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడం, నిధులు రాకపోవడంతో గొర్రెల కాపరిగా మారాన‌ని, తనకు రోజువారి కూలీగా రూ.500 ఇస్తున్నట్టు సుబ్బయ్య పేర్కొన్నారు. గ్రామంలో నిధులు రావటం లేదనే అసంతృప్తితోనే గొర్రెలు కాస్తు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed