అన్నదాతకు అన్యాయం చేయవద్దు.. ప్లకార్డులతో TRS ఎంపీల నిరసన

by  |
అన్నదాతకు అన్యాయం చేయవద్దు.. ప్లకార్డులతో TRS ఎంపీల నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలంటూ పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందుతోందని అన్నారు. దీంతో దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్‌సీఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయని, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు.


Next Story