బండి సంజయ్ పిచ్చికూతలు మానుకోవాలి

by  |
బండి సంజయ్ పిచ్చికూతలు మానుకోవాలి
X

దిశ, వెబ్‌డెస్క్: 2023లో కాదు 2048లో కూడా బీజేపీ అధికారంలోకి రాదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ పిచ్చికూతలు మానుకోవాలని అన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదన్నారు. మతం, కులం పేరుతో టీఆర్ఎస్ రాజకీయాలు చేయదని తెలిపారు. బీజేపీ నేతల విమర్శలు హద్దు దాటుతున్నాయని గువ్వల బాలరాజ్ ధ్వజమెత్తారు. మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌ని బీజేపీ నేత‌లు.. వారి గురించి మాట్లాడేందుకు సిగ్గుండాల‌న్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్‌పై బండి సంజయ్ తెలుసుకోవాలని తెలిపారు. కౌన్సిల్ ఏర్పాటుపై బీజేపీ ఆందోళన అర్థరహితమని గువ్వల బాలరాజ్ విమర్శించారు.


Next Story

Most Viewed