కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత.. ఘనస్వాగతం పలికిన నేతలు..

by  |
కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత.. ఘనస్వాగతం పలికిన నేతలు..
X

దిశ, భీమ్‌గల్: కొండగట్టుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన నాయకునిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించామో అవి నెరవేరేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో శాంతి నెలకొనాలి, సమాజంలో ఏ ఒక్కరు పేదరికంలో ఉండొద్దు అనేది కేసీఆర్ లక్ష్యం అని వ్యాఖ్యానించారు. మోర్తాడ్ మండల ప్రజలు ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా నిలిచారాని గుర్తు చేశారు. మోర్తాడ్ ప్రజల రుణం తీర్చుకుంటామని కవిత అన్నారు.

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన అమ్మ అశోక్



Next Story