నిరుద్యోగులపై టీఆర్ఎస్ నేతల దాడి

by  |
నిరుద్యోగులపై టీఆర్ఎస్ నేతల దాడి
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల ఐఎంఎల్ మద్యం డిపోలో హమాలి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నిరుద్యోగులపై టీఆర్ఎస్ నేతలు దాడికి దిగారు. దీంతో డిపోలో ఉద్యోగం ఇవ్వాలని ఫిర్యాదు చేసిన నిరుద్యోగులకు గ్రామ సర్పంచ్, టీఆర్ఎస్ నేతలకు మధ్య మద్యం డిపో ముందు తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది నిరుద్యోగులను టీఆర్ఎస్ కార్యకర్తలు గదిలో బంధించారని, సెల్ ఫోన్లను లాక్కొని చితకబాదారని నిరుద్యోగులు ఆరోపించారు. దీనిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.


Next Story

Most Viewed