- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం .. టాస్క్ ఫోర్స్ పోలీసుల మీదే దాడి..!

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం రోజురోజుకూ మితిమీరుతోంది. తాజాగా ఓ దాబాలో మద్యం సేవిస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రశ్నించడంతో వారిపైనే దాడికి దిగినట్లు సమాచారం. ఖమ్మంలోని వైరారోడ్డులో గల వీవీపాలెం సమీపంలోని రెడ్ చిల్లీ దాబాలో టీఆర్ఎస్ పార్టీ కొనిజర్ల మండలం మాజీ అధ్యక్షుడు కోసూరు శ్రీనివాసరావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాయల పుల్లయ్య, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటి, రాజ్య తండా సర్పంచ్ మూడు సురేష్, అనంతుల సత్యనారాయణ, జమ్ముల ప్రవీణ్ రెడ్డి, తుళ్లూరి రమేశ్, గుర్రం రాజేశ్ మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో రెడ్ చిల్లీ దాబాలో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ కు చెందిన పోలీసులు అక్కడకు వెళ్లి, దాబాలో మద్యం సేవిస్తున్న వారిని ఫొటోలు తీశారు.
దీంతో విపరీతమైన మద్యం మత్తులో ఉన్న సదరు నాయకులు ఆగ్రహానికి లోనైన సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులపైన దాడికి దిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన తమనే ప్రశ్నిస్తారా అంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులను కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖమ్మం అర్బన్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని సదరు నేతలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మొత్తం ఈ ఘటనలో దాడికి పాల్పడిన 8 మందితో పాటు దాబా నిర్వహకునిపై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.