ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్స్ బైక్‌ ఆవిష్కరణ

by  |
ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్స్ బైక్‌ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌ సైకిల్స్ మంగళవారం తన సరికొత్త టైగర్ సిరీస్- టైగర్ 850 స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించింది. హై స్పెసిఫికేషన్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ 850 టైగర్ ట్రిపుల్ ఇంజన్ సెటప్‌తో మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. బీఎస్6 శ్రేణిలో మోడరన్ క్లాసిక్, అడ్వెంచర్, రోడ్‌స్టర్ విభాగంలో ఇది వస్తోందని, ఇదివరకు ఈ విభాగాల్లో ఐకానిక్ రాకెట్ 3ఆర్, రాకెట్ 3జీటీ, టైగర్ 900 బైక్‌లు మార్కెట్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

టైగర్ 900 బైక్ తరహాలో సరికొత్త టైగర్ 850 బైక్ టి-ప్లేన్ క్రాంక్ ఇంజిన్‌తో వస్తుందని పేర్కొంది. అయితే, భారత్‌కు సంబంధించిన ధరలను డిసెంబర్‌లో ప్రకటించనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. టైగర్ 900 సిరీస్‌లో ఎంట్రీ లెవల్ మోడల్‌గా భావిస్తున్న ఈ బైక్ ధర ఇదివరకే లాంచ్ చేసిన బైకుల కంటే తక్కువ ధరలోనే లభించనుందని ఆయన వివరించారు. 2021 మొదటి సగం నాటికి భారత్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం భారత్‌లో ఈ బైక్ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.



Next Story