మొక్కలు నాటిన త్రిష

by  |
మొక్కలు నాటిన త్రిష
X

దిశ, వెబ్‌డెస్క్: స్మైలింగ్ క్వీన్ ‘త్రిష’ సామాజిక కార్యక్రమాల్లో ముందుంటుంది. ‘పెటా’కు అంబాసిడర్‌గా ఉంటూ పెంపుడు జంతువుల సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న త్రిష.. తాజాగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించింది.

https://twitter.com/trishtrashers/status/1312295875046068224?s=19

ఎంపీ సంతోష్ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది తారలు పాల్గొంటూ అభిమానులను కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడు. ఆ తర్వాత త్రిష, సూర్య, రక్షిత్ శెట్టిలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. కాగా ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన త్రిష.. తన నివాసంలో రెండు మొక్కలు నాటింది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని.. భారత్‌ను గ్రీనర్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చింది.


Next Story

Most Viewed