మావోయిస్టులకు గిరిజనుల షాక్..

by  |
మావోయిస్టులకు గిరిజనుల షాక్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మావోయిస్టులకు గిరిజనులు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కోసం బలగాలు ఓ వైపు కూంబింగ్ నిర్వహిస్తుంటే.. మరోవైపు అమరవీరుల వారోత్సవాలు చేసేందుకు మావోయిస్టులు నిమగ్నం అయ్యారు. అయితే, మహారాష్ట్రలో మాత్రం ఆదివాసీలే మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు.ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం పోలీసులు వెతుకున్న క్రమంలో ఆదివాసీలు కూడా పోలీసులకే మద్దతుగా నిలిచారు. జిల్లాలోని దానోర తాలుకాలోని సావర్ గావ్, ముర్మాగావ్ రహదారిలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బ్యానర్లను గిరిజనులు తగలబెట్టారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను దగ్దం చేయడమే కాకుండా వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


Next Story

Most Viewed