ఆ పనికి వచ్చిన ఇద్దరు మహిళలు.. దొరికిపోవడంతో బట్టలు తీయించి

by Disha Web Desk 21 |
ఆ పనికి వచ్చిన ఇద్దరు మహిళలు.. దొరికిపోవడంతో బట్టలు తీయించి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య దొంగల ముఠాలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో పురుషులే కాకుండా మహిళలు కూడా భాగమయ్యేందుకు వెనకడుగువేయడం లేదు. ఈ క్రమంలో డబ్బు, ఆభరణాలతో పాటు చిన్న పిల్లలను సైతం కిడ్నాప్ చేస్తున్నారు. ఇక ఇలా కొన్ని రోజుల నుంచి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసు యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అయినా కొందరి ఆగడాలు మాత్రం ఆగలేదు. ఈ మేరకు ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు మహిళలు దొరికిపోవడంతో కుటుంబీకులు తగిన బుద్ది చెప్పారు.

ముంబైలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు మహిళలు.. ఇంట్లో వాళ్లు అందరూ నిద్రపోతున్నారని అనుకున్నారు. కానీ, అప్పటికే మెలుకువలోనున్న కుటుంబ సభ్యులు ఆ మహిళలను గమనించి ఇరుగుపొరుగువారికి సమాచారం అందించారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న పొరిగింటి వారు.. ఆ ఇద్దరి మహిళలు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికే వచ్చారనుకున్నారు. దీంతో వారి బట్టలు తీయించి వారిని చెక్ చేశారు ఇంటి మహిళలు. ఆపై వారికి నాలుగు చీవాట్లు పెట్టారు. అయితే తాము అలాంటి వాళ్లము కాదని.. కేవలం చోరీ చేయడానికి మాత్రమే వచ్చామని ఆ మహిళలు వాళ్లకి చెప్పి ప్రాధేయపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed