ఎలుక పోయిందని కేస్.. వారిపైనే డౌట్ అంటూ ఫిర్యాదు!

by Disha Web Desk 6 |
ఎలుక పోయిందని కేస్.. వారిపైనే డౌట్ అంటూ ఫిర్యాదు!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా బంగారం పోయింది, వాహనం పోయింది అంటూ కేసులు పెట్టడం చూశాం. తాజాగా.. పోలీసులకు ఓ ఆసక్తికర ఫిర్యాదు వచ్చింది. ఎలుక పోయిందంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బాంసవాడా జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కి చెందిన మంగు అనే వ్యక్తి తాను అల్లారుముద్దుగా 700 గ్రాముల ఎలుకను పెంచుకుంటున్నాడు. అయితే గతనెల దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఆదివారం బాంసవాడా జిల్లా సజ్జన్‌గఢ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా తన సోదరుడి ముగ్గురు కుమారులపై అనుమానం ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను విచారణకు పిలిచినట్లు తెలిపారు. ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని పోలీసులు అంటున్నారు.


Next Story

Most Viewed