ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి సృహ కోల్పోయిన యువకుడు..

by Disha Web Desk 6 |
ఎగ్జామ్ హాల్‌లో అమ్మాయిలను చూసి సృహ కోల్పోయిన యువకుడు..
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అబ్బాయిలను చూసి అమ్మాయిలు భయపడతారు. కానీ, బీహార్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అమ్మాయిలను చూసి ఓ యువకుడు సృహ కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందా ప్రాంతానికి చెందిన మనీష్ శంకర్ ప్రసాద్ అనే ఇంటర్ విద్యార్థి ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఇంటర్ పరీక్షలు రాసేందుకు బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు వచ్చాడు. ఎగ్జామ్ హాల్‌లో 500 మంది అమ్మాయిలు కనిపించేసరికి ఒక్కసారిగా సృహ కోల్పోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం మనీష్ కోలుకున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed