ఎక్స్‌ప్రెస్ వేపై దోపిడీ దొంగల హల్ చల్.. దొంగలను పట్టించిన డ్యాష్ బోర్డ్ కెమెరా

by Ramesh Goud |
ఎక్స్‌ప్రెస్ వేపై దోపిడీ దొంగల హల్ చల్.. దొంగలను పట్టించిన డ్యాష్ బోర్డ్ కెమెరా
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్స్ ప్రెస్ వేవై దోపిడీ దొంగలు హల్ చల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) గా మారింది. ఓ ఎక్స్‌ప్రెస్ వే (Express Way)పై కొందరు దోపిడీ దొంగలు దారి కాచి అటుగా ప్రయాణిస్తున్న వారిని దోచుకుంటున్నారు. రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డుగా పెట్టి వాహనాలను ఆపడమే గాక కత్తులతో బెదిరించి దోపిడీ చేస్తున్నారు. వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఎక్స్ ప్రెస్ హైవేపై కారులో ప్రయాణిస్తూ వెళుతున్నాడు. ఇంతలో రోడ్డుపై చెట్ల కొమ్మలు ఉండటం చూసి హారన్ కొడుతూ.. కారు వేగం తగ్గించాడు.

ఇంతలో కొందరు వ్యక్తుల చేతిలో కత్తులతో రోడ్డు మీదికి వచ్చి కారును ఆపే ప్రయత్నం చేశారు. వారిని దారి దోపిడి దొంగలుగా గుర్తించిన డ్రైవర్ కారును ఆపకుండా వెనక్కి నడిపాడు. దీంతో ఆ దొంగలు వేట కత్తులు కారుపై విసురుతూ.. బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ డ్రైవర్ చాకచక్యంగా దోపిడి దొంగలు నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన కారులోని డ్యాష్ బోర్డు కెమెరా (Car Dash Board Camera)లో రికార్డ్ అయింది.

అనంతరం ఆ వ్యక్తి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ప్రకారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి శ్రీనగర్ (Srinagar) లోని ఢాకా-మావా ఎక్స్‌ప్రెస్ వే (Dhaka -Mava Express Way)పై జరిగిందంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది శ్రీనగర్ లో జరిగింది కాదని, కెమెరాలో ఉన్న జీపీఎస్ కోఆర్డినేట్స్ ప్రకారం అడ్రస్ బంగ్లాదేశ్ (Bangladesh) అని చూపిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.



Next Story

Most Viewed