క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త

by Disha Web Desk 21 |
క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. 25వ తేదీన మెట్రో సర్వీసుల సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలియజేసింది. మ్యాచ్ అయిపోయిన అనంతరం ప్రేక్షకులు సులువుగా తమ నివాసాలకు చేరుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీ‌ఎస్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed