- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన నారాయణగూడ వైఎంసీఏ లో జరుపుకోనున్న సదర్ ఉత్సవ్ మేళాను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ను దారిమళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు.
కాచిగూడ చౌరస్తా నుండి వైఎంసీఏ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ దారిలో వచ్చే వాహనాలను కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. విట్టల్వాడి క్రాస్ రోడ్స్ నుండి వైఎంసీఏ నారాయణగూడ వైపు వాహనాల రాకపోకలను రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. రాజ్మొహల్లా నుండి వాహనాల రాకపోకలు, సాబూ షాప్ పాయింట్ వద్ద రామ్కోటి చౌరస్తా వైపు మళ్లిస్తారు. రెడ్డి కళాశాల (స్ట్రీట్ నెం. 8) నుండి వాహనాల రాకపోకలు అనుమతించబడవు. ఇవి బర్కత్పురా వైపు మళ్లించబడతాయి. పాత బర్కత్పురా పోస్టాఫీసు నుండి వైఎంసీఏ నారాయణగూడ వైపు వాహనాల రాకపోకలు క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు దారి మళ్లిస్తారు.
పాత ఎక్సైజ్ ఆఫీస్ లైన్ నుండి వైఎంసీఏ నారాయణగూడ వైపు వాహనాల రాకపోకలను, విట్టల్వాడి వైపు మళ్లిస్తారు. బర్కత్పురా చమన్ నుండి వైఎంసీఏ నారాయణగూడ వైపు వాహనాల రాకపోకలు అనుమతించబడవు. ఇది బర్కత్పురా ఎక్స్ రోడ్స్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తారు. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ (నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర) నుండి రెడ్డి కళాశాల వైపు వాహనాల రాకపోకలను నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. నగర ప్రజలు ట్రాఫిక్ దారి మళ్లింపును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు.