డీఎస్‌ను పరామర్శించిన రేవంత్ రెడ్డి.. గంటపాటు సుదీర్గ చర్చ!

by  |
డీఎస్‌ను పరామర్శించిన రేవంత్ రెడ్డి.. గంటపాటు సుదీర్గ చర్చ!
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు.హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో డీఎస్ తన పుట్టిన రోజు సందర్భంగా పూజ గది వద్ద ప్రమాదవశాత్తు జారి పడటంతో చేయి విరిగింది. అనంతరం ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు సర్జరీ చేశారు.

ఈ క్రమంలోనే డీఎస్‌ను రేవంత్ రెడ్డి కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. డీఎస్‌ను టీఆర్‌ఎస్ దూరం పెట్టడంతో చాలా కాలంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల డీఎస్ పెద్ద కొడుకు నిజామాబాద్ తొలి మేయర్ డి.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించి, రేవంత్ పీసీసీ అధ్యక్షులు కాగానే ఆయన్ను కలిసిన విషయం తెలిసిందే. కానీ, అధికారికంగా నేటికీ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలోనే ధర్మపురి శ్రీనివాస్‌తో రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీపై ప్రస్తుత రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.


Next Story

Most Viewed