రిస్క్‌లో టాలీవుడ్ సింగర్ ఫ్యామిలీ.. రైల్వే ట్రాక్‌పై శవంగా తండ్రి.. ఏమైంది ?

by  |
రిస్క్‌లో టాలీవుడ్ సింగర్ ఫ్యామిలీ.. రైల్వే ట్రాక్‌పై శవంగా తండ్రి.. ఏమైంది ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సింగర్ హరిణి కుటుంబం అదృశ్యం అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఏకే రావు ఫ్యామిలీ వారం రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో వీరి ఫ్యామిలీ కోసం పోలీసులు గాలించగా బెంగుళూరు సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌పై హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. ఈయన సుజన్‌ ఫౌండేషన్‌లో సీఈవోగా ఉన్నారు. ప్రస్తుతం హరిణి కుటుంబసభ్యులు బెంగుళూరు రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పదస్థితిలో ఏకే రావు మృతి చెందడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ, పోలీసులు వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.


Next Story

Most Viewed