- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ తన మంచి మనసును చాటుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తాను ధరించిన జెర్సీని ఒక చిన్నారి చికిత్స కోసం వేలం వేయాలని నిర్ణయించాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 8 ఏళ్ల చిన్నారి వైద్యం కోసం తన జెర్సీని అమ్మాకానికి పెట్టాడు. హోలీ బీటి అనే చిన్నారి న్యూరో బ్లాస్టోమా అనే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్నది. హోలీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న టిమ్ సౌథీ.. తన జెర్సీపై టీమ్ ఆటగాళ్లందరితో సంతకాలు చేయించి వేలానికి పెట్టాడు. తాను ధరించిన జెర్సీ మరొకరికి ఉపయోగపడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. జులై 8 వరకు బిడ్డింగ్ ఓపెన్లో ఉంచుతాము. అప్పటి వరకు ఎవరైనా బిడ్లు వేయవచ్చు. ఇపపటి వరకు 152 బిడ్లు రాగా.. వాటిలో ఒక బిడ్ 7వేల డాలర్లు చెల్లిస్తామని వచ్చింది. ఇంకా భారీ మొత్తం వస్తుందని తాను ఆశిస్తున్నానని సౌథీ పేర్కొన్నాడు. కాగా, జూన్ 18 నుంచి 23 వరకు జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు టీమ్ ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.