ముదిగొండలో విషాదం.. NSP కెనాల్‌లో ముగ్గురు గల్లంతు

by Sridhar Babu |   ( Updated:2021-12-06 23:56:10.0  )
NSP Canal
X

దిశ, ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టకూరు గ్రామంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన గమి(30), సాజన్(19), మణి(29) అనే ముగ్గురు వ్యక్తులు వరికోత మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఎన్నెస్పీ కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గమి(30)అనే వ్యక్తి సాగర్ కాలువలో జారి పడ్డట్లు సమాచారం. గమనించిన మిగతా ఇద్దరు గమిని కాపాడబోయి వరద ఉధృతికి ముగ్గురూ గల్లంతు అయినట్లు సమాచారం. మంగళవారం ఉదయం కాలువ వైపు వెళ్లిన స్థానికులు గట్టుమీద వారి బైకును గమనించి ఎన్నెస్పీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు కాలువ నీటి ప్రవహాన్ని తగ్గించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed