మాస్క్ ధరించని 8 మందికి వెయ్యి జరిమానా

by Sridhar Babu |   ( Updated:2021-12-05 07:18:19.0  )
మాస్క్ ధరించని 8 మందికి వెయ్యి జరిమానా
X

దిశ, అశ్వారావుపేట టౌన్: కరోనా అప్డేట్ వెర్షన్ ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో ప్రవేశించిందనే వార్తల నేపథ్యంలో అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కూడా కరోనా ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఎస్సై చల్లా అరుణ నిర్వహించిన వాహన తనిఖీలలో మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న 8 మంది వ్యక్తులకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. అలాగే పెండింగ్ లో ఉన్న 30 చలానాలను చెల్లించే విధంగా అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, సమాజ శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, లేని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే వ్యక్తులకు రూ. వెయ్యి జరిమానా తప్పదని ఎస్సై చల్లా అరుణ తెలిపారు.



Next Story