జ్యువెలరీలో సీసీ కెమెరాల ఫుటేజీని ఎత్తుకెళ్లిన దొంగలు

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ జ్యువెలరీలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు రెహన్ జ్యువెలరీలోకి ప్రవేశించి 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.4లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ సమయంలో దొంగలు తెలివిగా వ్యవహరించారు. దొంగతనం చేసింది ఎవరో తెలియకుండా సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డు అయ్యే డీవీఆర్ బ్యాక్స్ ను కూడా దుండగులు అపహరించారు. ఆలస్యంగా గుర్తించిన జ్యెవెలరీ నిర్వహకులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన [&hellip;]</p>

Rehan Jewelery
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ జ్యువెలరీలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు రెహన్ జ్యువెలరీలోకి ప్రవేశించి 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.4లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ సమయంలో దొంగలు తెలివిగా వ్యవహరించారు. దొంగతనం చేసింది ఎవరో తెలియకుండా సీసీ కెమెరాల ఫుటేజీ రికార్డు అయ్యే డీవీఆర్ బ్యాక్స్ ను కూడా దుండగులు అపహరించారు. ఆలస్యంగా గుర్తించిన జ్యెవెలరీ నిర్వహకులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జ్యెవెలరీ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీరి పరిశీలిస్తున్నారు.

Next Story