- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంక్లు, బాటిళ్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, పోర్టేబుల్ ఆక్సిజన్ జెనరేటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లకు ఉపయోగించే స్టీల్ పైప్లను మోసుకొచ్చే నౌకలపై అన్ని రకాల చార్జీలను మాఫీ చేయాలని ప్రధాన పోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నౌకలను వెంటనే బెర్తింగ్ చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని, అంతేవేగంగా అన్లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వ శాఖ కామరాజ్ పోర్టు లిమిటెడ్ సహా అన్ని మేజర్ పోర్టులను ఆదేశించింది. ఈ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని పోర్టు చైర్పర్సన్లను కోరింది. అన్లోడింగ్కు కావాల్సిన కస్టమ్స్, ఇతర అధికారుల నుంచి వేగంగా క్లియరెన్స్లు వచ్చేందుకు ఉపక్రమించాలని తెలిపింది.