మద్యం దుకాణంలో చోరీ

by  |
మద్యం దుకాణంలో చోరీ
X

దిశ, కామారెడ్డి: రామారెడ్డి మండల కేంద్రంలోని మానస వైన్ షాపులో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి మద్యం దుకాణంలోకి చొరబడ్డారు. 20 మద్యం బాటిళ్లతో పాటు రెండువేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఎప్పటిలాగే మద్యం దుకాణం తీయడానికి వెళ్లిన యజమానికి తాళాలు పగలగొట్టి ఉండటం కనిపించింది.

లోపలికి వెళ్ళి చూడగా మద్యం బాటిళ్లు, కౌంటర్‌లో నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రామారెడ్డి పోలీసు స్టేషన్‌లో సీసీ ఫుటేజిని పరిశీలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మద్యం షాపు నిర్వహకుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


Next Story

Most Viewed