వారం క్రితం మిస్సింగ్.. మురుగు కాలువలో అలా..

by  |
వారం క్రితం మిస్సింగ్.. మురుగు కాలువలో అలా..
X

దిశ, వనపర్తి : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోనీ 4వ వార్డులో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేసే క్రమంలో మురుగు కాలువ‌లో అనుమానాస్పద మహిళ మృతదేహం‌ను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ రెండోవ ఎస్సై మల్లేష్, ఏ ఎస్ ఐ మన్యపు రెడ్డి, కానిస్టేబుల్ నవీన్ గౌడ్ సంఘటన స్థలం చేరుకొని జేసీబీ సహాయంతో కాలువ పై ఉన్నా సిమెంట్ కాంక్రీట్‌ను తొలగించి మృతదేహం‌ను ప్రభుత్వ మార్చురీ‌కి తరలించారు.

ఏఎస్ ఐ మన్యపు రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మృతురాలు పేరు గంధం సుచరిత (39)‌గా గుర్తించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసామని, దర్యాప్తు అనంతరం హత్యా లేక ప్రమాదావశాత్తు మృతి చెందిందాఅన్న పూర్తి వివరాలు వెళ్లాడిస్తామని తెలిపారు. వారం క్రితం మిస్సింగ్ కేసు నమోదు అయిన మహిళా ఇలా అనుమానస్పదంగా మురుగు కాలువలో శవంగా మారడం పలు అనుమానాలకు తావిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Next Story