- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి. పాక్ లో మైనారిటీలకు రక్షణ లేదు అనేది ఎంత నిజమో అక్కడ దేవాలయాల పరిస్థితి కూడా అలాగే ఉన్నది అనేది కూడా అంతే నిజం. తరచుగా అక్కడి అల్లరి మూకలు దేవాలయాలపై దాడులు చేయడం, పోలీసులు కేసులు పెట్టడం, రెండ్రోజుల్లోనే అత్తరింటికి వచ్చిన వారిలా వాళ్లు బయటకు రావడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్తాన్ లోని కరాచీ లో జరిగింది. కరాచీ టౌన్ లోని ఓల్డ్ సిటీ లో నారాయణ్ పురాలో హిందువులు కొలుచుకునే నారాయణ దేవాలయం ఉంది. మంగళవారం సాయంత్రం కొంతమంది దుండగులు నాటు గొడ్డళ్లు తీసుకుని దేవాలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న వారిని బయటకు తరిమేసి విగ్రహం పై దాడి చేశారు.
నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ముకేశ్ కుమార్ అనే స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఉంటున్న హిందువులకు, ఆలయాలకు రక్షణ కల్పించాలని పలువురు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.