- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమింపబడిన జస్టిస్ డా.కె.మన్మథరావు, జస్టిస్ కుమారి బొడ్డుపల్లి శ్రీ భానుమతిలు బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మధ్యాహ్నం 2.15గంటలకు ఇద్దరు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులు బెంచ్లలో పాల్గొని కేసులను విచారించనున్నారు.
ఇకపోతే ఈ ఇద్దరి న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరింది. ఇకపోతే డాక్టర్ కె.మన్మథరావు స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ. ఏయూ నుంచి బీఎల్, ఓయూ నుంచి ఎల్ఎల్ఎం, ఆంధ్రాయూనివర్సిటీ నుంచి ‘లా’లో పీహెచ్డీ చేశారు. 1991 జూన్ 25న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఒంగోలు, కందుకూరులో ప్రాక్టీసు చేశారు. 1999లో ప్రాక్టీసును హైదరాబాద్కు మార్చుకున్నారు. సీబీఐ, ఎక్సైజ్ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్గా, ఈడీ, డీఆర్ఐలకు స్పెషల్ పీపీగా, ప్యానల్ కౌన్సెల్గా సేవలు అందించారు. ప్రస్తుతం వివిధ కేంద్రప్రభుత్వ శాఖలు, ఆర్థికసంస్థలు, వివిధ కంపెనీలకు స్టాండింగ్ కౌన్సెల్గా పని చేస్తున్నారు.
ఇక మరో న్యాయమూర్తి బీఎస్ శ్రీ భానుమతి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది బీకేవీ శాస్త్రి కుమార్తె. రాజమహేంద్రవరం, కొవ్వూరులో విద్యాభ్యాసం చేశారు. న్యాయవాదిగా పదేళ్లు ప్రాక్టీసు చేశారు. 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వరంగల్, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో న్యాయసేవలు అందించారు. 2020 జూన్లో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టులో తొలి మహిళ రిజిస్ట్రార్ జనరల్గా ఆమె గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
- Tags
- ap
- high court