- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సూర్యా పేట: సీఎం కేసీఆర్ దళితులను దగా చేసున్నాడని తెలంగాణ జనసమితి ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ‘ఏడేండ్ల తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలు-తీరుతెన్నులు’ అనే అంశంపై ఆ సంఘం ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ఓట్లు వేయించుకున్న కేసీఆర్ తన పార్టీ అధికారంలోకి రాగానే మాట తప్పి తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని విమర్శించారు. హైదరాబాద్లో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ గొప్పలు చెప్పి ఇంత వరకు ఏర్పాటు చేయలేదన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. దళిత, గిరిజన వాడల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్ట్లను భర్తీచేయడం లేదని, దళితుల సాగులో ఉన్న అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై వివక్షత, దాడులు, లాకప్ హింసలు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు. ఈ సమావేశంలో దాసరి రాములు, అరుణజ్యోతి, బచ్చలకూరి జానయ్య, ఆంగోతు సూర్యనారాయణ, దేవత్ సతీష్, కారింగుల వెంకన్న, చెవు శ్రీను, రామన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.