- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఆడవారు బయటకి రావడానికే భయపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరిగే అరాచకాలను ఆపలేకపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన కొంతమంది మగాళ్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఒక యజమాని తన సెక్రటరీ పై కన్నేసి, పని ఉందని రూమ్ కి పిలిచి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె అందరికి చెప్పేస్తానని బెదిరించడంతో 10వ అంతస్తు నుంచి తోసి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేకెత్తిస్తోంది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ప్రతీక్ వైశ్ (40) డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద 19 ఏళ్ల యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఎప్పటిలానే రెండు రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లింది. ఇంటి వెళ్లిన ఆ యువతిని.. అధికారిక పనుల నిమిత్తం కల్యాణ్పూర్లోని తన ఫ్లాట్కు రమ్మని ఫోన్ చేసి పిలిచాడు. యజమాని ఫోన్ చేశాడు కదా అని ఆమె వెళ్లింది. అక్కడ ఆమెను బలవంతంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. తనంటే ఇష్టమని, డబ్బులు ఇస్తానని కోరాడు. దానికి ఆ యువతి ససేమిరా అనడంతో ప్రతీక్ మృగాడిలా ప్రవర్తించాడు.
తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎంత ఒత్తిడి చేసినా.. ప్రలోభాలకు గురిచేసినా వినకపోవడంతో రేప్ చేశాడు. యువతి ఏడుస్తూ పోలీసులకు చెబుతాననడంతో ప్రతీక్ వైశ్ కిరాతకంగా ప్రవర్తించాడు. ఎక్కడ యువతి బయటకు వెళ్లి తన గురించి చెప్తుందో అని తాను నివసిస్తున్న 10 వ అంతస్తు నుంచి యువతిని తోసి హతమార్చాడు. అనంతరం అదొక ప్రమాదంగా చిత్రీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యువతి మృతదేహానికి పరీక్షలు చేయగా ప్రతీక్ గుట్టురట్టు అయ్యింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ప్రతీక్ ని తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను నిజం ఒప్పుకున్నాడు. అత్యాచారం జరిగిన తర్వాత, ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో బాల్కనీ నుంచి తోసేశానని తెలిపాడు,. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.