ఆమ్లెట్ తిన్నాడని హత్య.. వైన్ షాప్ ముందు బంధువుల ఆందోళన

by  |
ఆమ్లెట్ తిన్నాడని హత్య.. వైన్ షాప్ ముందు బంధువుల ఆందోళన
X

దిశ, సూర్యా పేట; నూతనకల్ మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన ధరవత్ శీను (35) శుక్రవారం రాత్రి పట్టణంలోని ఒక వైన్ షాపులో మద్యం సేవిస్తుండగా ఆమ్లెట్ ఆర్డర్ చెప్పాడు. అదే సమయంలో శీను పక్క టేబుల్ వ్యక్తి కూడా ఆమ్లెట్ ఆర్డర్ ఇవ్వడంతో మొదటగా ఆర్డర్ చేసిన వ్యక్తికి కాకుండా శ్రీనుకు అమెల్ట్ ఇవ్వడంతో ఇద్దరు ఒకరికి ఒకరు ఘర్షణ కు దిగారు. దీనితో తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. చనిపోయిన శ్రీను డెడ్ బాడీ ని ఆటోలో ఖమ్మం రోడ్ లోని మూసి ఉన్న ఒక వైన్స్ షాపులో పడేసి వెళ్లిపోయాడు. మద్యం మత్తులో ఉన్న వాచ్ మెన్ తెల్లారి చూసేసరికి డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఫ్యామిలీ మెంబర్స్ కి సమాచారం ఇచ్చిన పోలీసులు ఆలస్యంగా అక్కడకు చేరుకునే సరికి వైన్స్ యాజమాని మద్యం అమ్మకాలను కొనసాగించారు.

దీనితో అక్కడకు చేరుకున్న బంధువులు వైన్స్ షాప్ కు చెందిన వాళ్లే హత్య చేశారని ఆరోపిస్తూ సూర్యాపేట ఖమ్మం రహదారి పై ధర్నాకు దిగారు. బాదితుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు వైన్స్ షాపులో నుండి డెడ్ బాడీ తరలించేది లేదని ఆందోళన చేపట్టారు. సీసీ టీ‌వి ఆధారంగా నిందితుదిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీ‌ఐ ఆంజనేయులు తెలిపారు.


Next Story