ఉద్యమ నేతకే మళ్లీ అధ్యక్ష పీఠం.. రెండవసారి మండల అధ్యక్షుడిగా ‘బల్గూరి’..

by  |
ఉద్యమ నేతకే మళ్లీ అధ్యక్ష పీఠం.. రెండవసారి మండల అధ్యక్షుడిగా ‘బల్గూరి’..
X

దిశ, మొగుళ్లపల్లి : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ ప్రస్థానంలో భాగస్వాములై, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేతనే మళ్లీ అధ్యక్ష పీఠం వరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రంగాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ బల్గూరి తిరుపతి రావును రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగిన బల్గూరి తిరుపతిరావు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మండలంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేకుండా చేసి పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేసేందుకు తాను క్రియాశీలకంగా వ్యవహించారు. ఆయన తీరు, అందరిని సమన్వయ పరుస్తూ కలుపుగోలుతనంతో వ్యవహరించే తీరు అధిష్టానం చూపు ఆయన వైపు మొగ్గు చూపేందుకు కారణమైందని సమాచారం.

అదేవిధంగా మండలంలో పార్టీ బలోపేతానికి విశేష సేవలందించారని, మృదుస్వభావి బల్గూరి తిరుపతి రావు నాయకత్వంలో పని చేయడానికి ప్రజలు, కార్యకర్తలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని భావించిన అధిష్టానం మళ్లీ ఆయనకే టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రమణా రెడ్డి, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, జడ్పీటీసీ జోరిక సదయ్య, పీఎసీఎస్ చైర్మన్ సంపేల్లి నరసింగరావు, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed