- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శేరిలింగంపల్లి: ఆడుకుంటానని ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలుడు సంపులో పడి మృతిచెందిన ఘటన శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలోని బ్లాక్ నెంబర్ 35, ఫ్లాట్ నెంబర్ 28 లో నివసిస్తున్న రాజు, అనుబాయ్ దంపతుల కుమారుడు అరుణ్ (7) మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకని ఇంటి నుండి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం రాత్రంతా గాలించారు. ఈ ఉదయం దగ్గరలోని సెప్టిక్ సంపులో బాలుడు మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న చందానగర్ సీఐ క్యాస్ట్రో, పోలీసు సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మిన్నంటిన రోదనలు
సంపులో పడి ఏడేళ్ల బాలుడు అరుణ్ మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదన మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పోరేట్ రాగం నాగేందర్ యాదవ్ బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలుడి అంత్యక్రియలకు తక్షణమే రూ.20వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు.