కిన్నెరసానిలో దర్జాగా ఇసుక మాఫియా.. చూసి చూడనట్టున్న అధికారులు..

by Sridhar Babu |
కిన్నెరసానిలో దర్జాగా ఇసుక మాఫియా.. చూసి చూడనట్టున్న అధికారులు..
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు కిన్నెరసాని వాగులో ర్యాంపు ఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్నారు. గత రెండు నెలలుగా ఈ ఇసుక దందాను జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతోనే ఇదంతా సాగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బూర్గంపాడు మండల కేంద్రం శివారులో కిన్నెరసాని వాగులో గతంలో ప్రభుత్వం అధికారికంగా ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. కాగా ర్యాంప్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో కొంత మంది అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతుల పేరిట కోర్టు ద్వారా అనుమతులు తీసుకుంటున్నారు.

ఆ తర్వాత రాత్రింబవళ్లు ఇసుక మేటలు పేరుతో బూర్గంపాడు కిన్నెరసాని వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని అధికార పార్టీ నాయకులు ఈ అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారు.ఈ ఇసుక అక్రమ రవాణాలో స్థానిక అధికార పార్టీ నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినా పట్టించుకోవడం లేదని బూర్గంపాడు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed