- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీటీ స్కాన్, హెచ్ఆర్ సీటీ ధరను రూ.3 వేలుగా నిర్ణయించింది. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్ వివరాలు, కరోనా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను కరోనా డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించింది.
కరోనా రోగి పేరు, ఫోన్ నెంబర్, సిటీ/హెచ్ఆర్ సీటీ స్కాన్ ఇమేజి, సీటీ స్కాన్ సైన్డ్ కాపీ వివరాలను డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇది అమలయ్యేలా జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది.
Next Story