విషాదం.. ఉరి వేసుకొని యువకుడు మృతి

by S Gopi |
విషాదం.. ఉరి వేసుకొని యువకుడు మృతి
X

దిశ, మర్పల్లి: ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మర్పల్లి మండలం దారుగులపల్లి గ్రామానికి చెందిన పట్లూర్ సతీష్(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. '6 నెలల క్రితం మృతుడికి యాక్సిడెంట్ అయింది. అప్పటినుంచి మతిస్థిమితం కోల్పోయి అదోలా ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ఎంత వెతికినా కనిపించలేదు. జహీరాబాద్ మండలం చెన్నై హైదరాబాద్ గ్రామానికి చెందిన అరుంధతితో 3 సంవత్సరాల క్రితం వివాహం అయింది' అని తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed