- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూల్ డ్రింక్ సాయంతో బాలికపై అత్యాచారం... నగ్న చిత్రాలు తీసి..
దిశ, వెబ్డెస్క్ : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇంటర్ విద్యార్థికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆపై ఆమె నగ్న చిత్రాలను మెుబైల్ లో చిత్రీకరించాడు. అనంతరం వాటిని మరో స్నేహితుడికి పంపించాడు. అతడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ వైరల్ అయ్యయి.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలానికి చెందిన నాగూర్ మీరావలి (19) డిప్లోమా చదువుతున్నాడు. ఇటీవల మార్కాపురంలో అతనికి తెలిసిన ఇంటర్ విద్యార్థిని పరిచయం అయింది. ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల కోసం మార్కాపురం వచ్చింది. దీంతో ఆ యువకుడు ఆమెతో మాటలు కలిపి... కూల్ డ్రింక్ తాగుదామని తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తరువాత ఆ యువకుడు ఆమెను వివస్త్రగా మార్చి తన మెుబైల్లో నగ్న చిత్రాలు చిత్రీకరించాడు. ఆ ఫొటోలను తన స్నేహితుడు రసూల్ (22)కు పంపించడంతో.. అతనుసోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు