- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాళ్లిద్దరూ యువకులే.. కానీ, ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.. చివరకు..

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపించినా ఈ మాట వాస్తవం. వాళ్లిద్దరూ మొదటగా ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు వీరు సాఫీగానే కొనసాగారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అందులో ఒకరు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలిసి అంతా షాకవుతున్నారు. స్థానికంగా పెద్ద చర్చే కొనసాగుతోంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన అర్జున్, రవి అనే ఇద్దరు యువకులు ఒకేచోట జాబ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం వీరి మధ్య కాస్త ప్రేమకు దారి తీసింది. ఇలా వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. దీంతో వీరు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం రవి తన జెండర్ నే మార్చుకున్నాడు. రియాగా మారాడు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అర్జున్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. పెళ్లి అనంతరం వీరిద్దరు కలిసి జీవిస్తున్నారు. కొద్దిరోజులపాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో రియా పోలీసులను ఆశ్రయించింది. తనని అర్జున్ పట్టించుకోవడంలేదని, తాను అర్జున్ తోటే ఉంటానని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.