- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికుల పై దృష్టి పెట్టాలి’.. కార్మికుల డిమాండ్
by Jakkula.Mamatha |
రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను కార్మికులను ఆదుకోవాలని సంఘ కార్మికులు డిమాండ్ చేశారు.

X
దిశ, కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను కార్మికులను ఆదుకోవాలని సంఘ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం టెండర్ విధానాన్ని రద్దు చేసి ఎప్పటిలాగే టీజీఎస్సీవో ద్వారా స్టాక్ను కొనుగోలు చేయాలని తెలిపారు. సంఘాలలో తయారైన 2026 ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన నిల్వ స్టాకులను వెంటనే ఖరీదు చేయాలని కోరారు. ఈ సమస్యల పై త్వరలోనే రాష్ట్ర మంత్రులను సంఘ సభ్యులు అంతా కలిసి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఆప్కో డైరెక్టర్ అడిగోప్పల సత్యనారాయణ, కార్మిక సంఘం నాయకులు సర్వేశం, చేనేత సమాఖ్య జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఆయా సంఘాల అధ్యక్షులు రమేష్, వెంకటేశం, శంకరయ్య పాల్గొన్నారు.
Next Story






