- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అన్ని రంగాల్లో మహిళలదే కీలక పాత్ర: జయరాం

X
దిశ, తిరుమలాయపాలెం: సమాజంలో అన్ని రంగాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీడీవో జయరాం నాయక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మేడిదపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో జయరాం నాయక్ మాట్లాడుతూ.. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా మహిళలు ప్రతి రోజు గౌరవించబడాలన్నారు. అనంతరం సర్పంచ్ బండ్ల విజయతోపాటు గ్రామంలో ఆరోగ్య, పంచాయతీ శాఖలలో సేవలందిస్తున్న మహిళామణులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకుడు బండ్ల సురేష్, ఏపీవో నరసింహారావు, ఈసీ మోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి సాలే ఉపేందర్, ఏఎన్ఎం మణి, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story