- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంతోషం సార్.. అందరి మనసులు నిండు చేశారు..

దిశ ప్రతినిధి, వరంగల్: సంతోషం సార్... ఇప్పుడు అందరి మనసులను నిండు చేశారు.. అంటూ సీఎం కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దయాకర్రావు, సత్యవతిలు కేసీఆర్తో సంబురాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల 89 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తామని, రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిపైన పని చేస్తున్న 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ ను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నందుకు గాను బుధవారం సీఎం కేసీఆర్ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరురి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్తో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుని తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల మనసులు నిండు చేశారని వ్యాఖ్యనించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ నిరుద్యోగుల్లో పండుగ వాతావరణం నెలకొందని ఇతర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.